
ఖరీదైన మనుషులు జైల్లో పడితే... వారికి అప్పటికప్పుడే కొత్త రోగాలు పుట్టెడు పుట్టుకొస్తాయి. పోలీసుల పహారాతో ఆసుపత్రికెళతారు. ఐసీయూలో విశ్రాంతి తీసుకుంటారు. తప్పనిసరై జైల్లో వుంటే విడిచిన బట్టలు ఉతికేందుకు, ఒళ్లు పట్టేందుకు తోటి ఖైదీలు సిద్ధంగా వుంటారు. ఆటలపై మనసు పడితే వాటికీ ఢోకా లేదు.
మంత్రులూ, ముఖ్యమంత్రులు, మాజీలు జైళ్లకు వెళ్తే చెప్పనే అక్కర్లేదు. నిన్నటి వరకు 'రాజా'లా వెలిగిపోయిన మాజీ కేంద్ర మంత్రివర్యులిప్పుడు చెరసాలలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరు కూడా గ్యాస్ట్రిక్ సమస్య వంక చెప్పేసి భేషుగ్గా ఇంటి భోజనం తెప్పించుకుంటున్నారు. జైలు అధికారులు పైకి మాత్రం రాజావారు కోరినా హోమ్ఫుడ్ అంగీకరించలేదని పత్రికా ప్రకటనలిచ్చేశారు. చట్టబద్ధంగా తప్పు చేయడంలో, చేయించడంలో రాజావారిది అందెవేసిన 'చెయ్యి' కదా. వాటితో పోల్చుకుంటే ఇదెంత!
దేవతా పులుసుతో ప్రాణాలు నిల్పుకొన్న స్వాతంత్య్ర సమరయోధులు, పోరాటయోధులు, సొంత లాభం ఆసాంతం మానుకొని పదిమంది మంచి కోసం పనిచేసే నిజమైన ప్రజాసేవకుల జైలు జీవితం ఎక్కడీ కాసులు వెదజల్లి కోరినది సాధించుకునే నెంబర్ వన్ మోసగాళ్ల కారాగార జీవితం ఎక్కడీ
No comments:
Post a Comment