Monday, April 25, 2011

దాసరి ఇండస్ట్రీకి పెద్ద శనిలా దాపురించారు: నిర్మాత రవిచంద్




దాసరి నారాయణరావు పెద్ద శనిలా దాపురించారని నిర్మాత రవిచంద్ మండిపడ్డారు. సమస్యలు ఇలా కొనసాగడానికి ఇటువంటివారే కారణమని అన్నారు. ఈ తరం పోతేగానీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే గత 15 రోజులకు పైగా సినిమా నిర్మాణం ఆగిపోయింది. కానీ... పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షూటింగ్‌లో కార్మికులు ఎవ్వరూ పనిచేయడం లేదు. ఎప్పటినుంచో అమలు చేస్తామన్న వేతన సవరణలు ఇంకా అమలు కావడం లేదు. మూడేళ్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అవన్నీ ఇస్తామని ఇటీవలే డి.సురేష్‌తో పాటు కొంతమంది అగ్ర నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
మార్చి 1 నుంచి కొత్త వేతనాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కానీ వాస్తవం విరుద్ధంగా ఉంది. ఫెడరేషన్‌కు లేఖ కూడా అలానే రాశారు. కానీ... కార్మికుల జీతాలు కొన్ని కారణాలవల్ల పెండింగ్‌లో ఉన్నవి మార్చి 1 నుంచి పనిచేసిన కొన్ని నిర్మాతల కంపెనీలను సంప్రదిస్తే... అది మాకు తెలీదు.. ప్రస్తుతం షూటింగ్‌ జరిగిన తేదీ నుంచే అమలు చేస్తామని చెబుతున్నారు. దీంతో మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది.

ఈ విషయమై ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఛాంబర్‌ చేతులెత్తేశాయి. సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించింది. లెక్కప్రకారం సోమవారం అంటే 25వ తేదీనుంచి షూటింగ్‌లు జరగాల్సి ఉంది. కానీ జరగడంలేదు. దీంతో ఛాంబర్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఫెడరేషన్‌ నాయకుల్ని రప్పించింది. తాజా సమాచారం ప్రకారం ఫెడరేషన్‌ కార్మికులకు న్యాయం చేయమంటోది. కానీ ఛాంబర్‌ మాత్రం... కార్మిక నాయకులు ఐక్యంగా ఉండండి.. ఆ తర్వాత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిసింది.

విశేషేమంటే.. కొంతమంది కార్మిక నాయకులు.. నిర్మాతలకు ఫేవర్‌గా ఉన్నారు. కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో.. సమస్యలు పరిష్కారం అయ్యేట్లు లేవని కార్మికులు వాపోతున్నారు.

No comments:

Post a Comment