Wednesday, June 1, 2011

తూచ్.. ఆ మాట తీసి గట్టు మీద పెట్టేశా: నయన

ప్రభుదేవాతో తన పెండ్లి జరిగితే ఇక సినిమాల్లో చేయనని చెప్పిన నయనతార మనసు మార్చుకున్నట్లు తెలియవచ్చింది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా తన చివరి చిత్రం బాలకృష్ణ చిత్రమైన 'శ్రీరామరాజ్యం' అని చెప్పింది. కానీ తాజా సమచారం ప్రకారం ఎన్‌.టి.ఆర్‌. బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ఇందులో ఫుల్‌లెంగ్త్‌ రోల్‌ కాదనీ, ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది.

పెండ్లితో కెరీర్‌ అటకెక్కనుందన్న తరుణంలో నయనతార మళ్ళీ నటించడం అభిమానులకు ఆనందమేగా మరి...

No comments:

Post a Comment