Thursday, June 9, 2011

ద ఇజ్జూ.. ద ఇజ్జూ.. కూరీ.. కూరీ...: కుక్కల్ని పిలుస్తున్న త్రిష

మన రాష్ట్రంలో పిచ్చికుక్కలు కరిచి పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ఇపుడు కుక్క కనబడితే చాలు వాటిని ఎగేసుకుంటున్నారు(పరుగెట్టిస్తున్నారు). అయితే తమిళ ప్రౌఢ సుందరి త్రిష మాత్రం అలా వీధుల్లో తిరిగే కుక్కల్ని చూసి జాలి పడుతోంది. పాపం.. వీధి కుక్కలు.. ఎవరి ఆదరణ లేకుండా అలా వీధుల్లోనే అనాధల్లా బతుకుతున్నాయని తన బాధను వ్యక్తం చేస్తోంది. అలా బతుకుతున్న అనాధ కుక్కల్ని కుటుంబానికొకటి చొప్పున తీసుకుని సాకితే వాటి జీవితం బాగుపడుతుందని లెక్చర్లిస్తోంది.

ఇంతకీ సడెన్‌గా ఈ అమ్మడికి కుక్కలపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందీ... అని ఆరా తీస్తే.. తేలిన విషయం ఏంటయా అంటే... జంతువుల సంరక్షణకు కృషి చేసే 'పెటా'కు అమ్మడు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. కుక్కల సంరక్షణ కోసం ఆ సంస్థ రూపొందిస్తున్న ప్రకటనలో ఈ బక్కపలుచని భామ నటిస్తోంది. ఈ సందర్భంగా కుక్కల సంరక్షణపై మాట్లాడింది.

ఈ లెక్చరు విన్నవారిలో ఒకతను, "కుక్కలపై అంతగా ప్రేమ ఒలకబోసే త్రిష.... అదిగో ఆ రోడ్డుపై దీనంగా చూస్తున్న ఆ గజ్జి కుక్కను తీసుకుని దాంతో ఫోజివ్వచ్చుగా" అంటూ గొణిగాడు. ఇదే మాటను కాస్త పెద్దగా చెప్పవయ్యా అంటే మాత్రం నోర్మూసుకుని వెళ్లిపోయాడు. అదీ సంగతి..!!

No comments:

Post a Comment