Friday, July 8, 2011

ఎంత కావాలంటే అంత చూపిస్తా.. పారితోషికం పట్టించుకోను...


"కోలీవుడ్‌ కోవా"గా పిలువబడుతున్న తాప్సీ తన అందాలను ఎంత చూపించమన్నా చూపిస్తాననీ, పారితోషికం తక్కువిచ్చినా పట్టించుకోనని నొక్కి వక్కాణిస్తోందట.
 రజినీకాంత్ అల్లుడు ధనుష్‌తో "ఆడుగళం" చిత్రం తనకు ఎన్నో అవకాశాలు తెచ్చి పెడుతుందని తాప్సీ కలలు కందట. అయితే ఆ చిత్రం ఆమెకు తప్ప మిగిలిన వారికి ఛాన్సులనే కాదు అవార్డులను సైతం తెచ్చిపెట్టింది.........కానీ తాప్సికి మాత్రం అనుకున్నంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం జీవా సరసన వందాన్ వెండ్రాన్ చిత్రంలో నటిస్తోంది. ఈమె చేతిలో ఈ ఒక్క చిత్రం మాత్రమే ఉంది. దీంతో షూటింగ్ అయిన తర్వాత ఇంట్లో కూచుని గోళ్లు గిల్లుకుంటోందట.

ఆ మధ్య టాలీవుడ్‌ నుంచి పలువురు దర్శకనిర్మాతలు ఛాన్సులిస్తామని ఫోన్లు చేస్తే తను కోలీవుడ్‌లో బిజీగా ఉన్నానని ఫోజులు కొట్టిందట. అవకాశాల్లేని ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్‌ను పలుకరిద్దామంటే ముఖం చెల్లడం లేదట.

No comments:

Post a Comment