Tuesday, January 31, 2012

నా పని అయిపోయిందనుకున్నారు: శ్రియ

sreya
బాలీవుడ్‌లో నా పనైపోయిందని, నాకిక అవకాశాలు రావని అనుకున్నారు.................. చాలామంది. దక్షిణాదిన కూడా సినిమాలు రావనుకున్నారు. కానీ వారు నోరు మూయించే అవకాశం వచ్చిందని నటి శ్రియ చెప్పింది.

ప్రస్తుతం తను బాలీవుడ్‌లో నటించిన 'గలీ గలీ చోర్‌ హై' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని చెపుతోంది. ఈ దెబ్బతో తనకు మరో మహర్దశ ప్రారంభమవుతుందని సొంత డబ్బా కొట్టుకుంటోంది.

హీరోయిన్లు ఐటంసాంగ్‌లకే పరిమితమనీ, ఏదోదో పుకార్లు పుట్టించారు. అయితే తను ఇంకా నేను హీరోయిన్‌నే అని గట్టిగా చెబుతోంది శ్రియ. ఇంతగా నొక్కి చెపుతోందంటే.. ఆమె అనుకుంటున్నట్లుగా హీరోయిన్ ఇమేజ్ జారి పోయిందేమో అని వెక్కిరిస్తున్నారు సినీజనం.

No comments:

Post a Comment