చెన్నయ్ లో జరుగుతున్న వందేళ్ల దక్షిణ భారత వేడుకలు ముగింపు దశకు
చేరుకున్నాయి. చివరి రోజైన మంగళవారం ఈ వేడుకలకు
ముఖ్య అతిథిగా రాష్ట్రపతి
ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. వందేళ్ల భారత సినిమా ఉత్సవాల సందర్భంగా ఆయన
సినీ రంగానికి ప్రముఖులు, అలనాటి మహానుభావులు చేసిన సేవను ఆయన కొనియాడారు.
చెన్నయ్ లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ వేడుకలు ఈ నెల 21నుంచి
జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చివరి రోజు వేడుకల్లో రాష్ట్రపతితో
పాటు తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్
చాందీ, నాలుగు ఇండస్ట్రీల సినీ ప్రముఖులు, నటులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment